మెట్పల్లి, ఏప్రిల్ 5: సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పట్టణంలో నాయీబ్రాహ్మణ సం ఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూలమాలలతో ఆయనను సత్కరించి తమ సంఘం తరఫున ఎమ్మెల్యేకు, సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం పట్టణాధ్యక్షుడు పగడాల శేఖర్, తంగళ్లపల్లి సత్యం, ద్యాగెల నవీన్, సమ్మెట రాజేశ్, మద్దూరు బాల గంగాధర్, లక్ష్మణ్, కృష్ణంరాజు, అప్పలస్వామి, రాజగంగారాం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..