హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు అందాయి. సీఎం దళిత సాధికారత పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. భేటీకి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకట్రెడ్డి, ఎంఐఎం నుంచి బలాలా, పాషా ఖాద్రి, తదితర నేతలు హాజరయ్యారు.