మహబూబ్ నగర్ : సాధ్యమైనంత మేరకు ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తొలుత సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్ పూర్తిచేశామన్నారు. ఇప్పుడు హైరిస్క్ పర్సన్స్ కు వ్యాక్సినేషన్ చేపట్టామని మంత్రి తెలిపారు.
మహబూబ్ నగర్ పురపాలక సంఘం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హైరిస్క్ పర్సన్స్ అయిన రైతుబజార్, వెజిటబుల్ మార్కెట్, పండ్ల వ్యాపారులకు, పూల వ్యాపారులకు, వీధి వ్యాపారులు, లిక్కర్ షాపులు, చికెన్ మరియు మటన్ షాపులు, కిరాణా షాపులు, హెయిర్ కటింగ్ షాపులు, ఐరన్ షాపులు, వివిధ రకాల వ్యాపారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, అంబేద్కర్ చౌరస్తా వద్ద గల ఎక్స్పో ప్లాజాలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
హైరిస్క్ వ్యక్తులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.