వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. సోమవారం జిల్లాలోని మోమిన్ పేట మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంపెనీ వ్యవహారాలు అన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు గాను సీసీలు, ఏపీవోలకు పవర్ ప్రజెంటేషన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఇక నుంచి కంపెనీ లావాదేవీలు అన్నీ ఫార్మర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించాలని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపర్చాలని సూచించారు.
రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నది. ఏ పంట వేశారు. ఎప్పుడు వేశారు. వేసిన పంట ఇప్పటి వరకు వస్తుంది. పండించిన పంట సేకరణ, మార్కెట్ తరలింపు, క్వాంటిటీ, అమ్మకాలు, ధరతో పాటు పంట తరలింపు వాహన వివరాలు అన్ని ఇందులో పొందు పర్చినట్లయితే పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు.
రిజిస్టర్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కంపెనీ అభివృద్ధికి అందరు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్, సెర్ప్ ఏపీడీ నర్సిములు, డీపీఎం శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి గఫూర్, కంపెనీ చైర్మన్ లు లక్ష్మి, ప్రమీల, ఏపీవోలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం