మోత్కూరు, జూన్ 3: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మోత్కూరు మండల వ్యవసాయశాఖ టాస్క్ఫోర్సు బృందం హెచ్చరించింది. గురువారం మున్సిపాలిటీ కేం ద్రంలోని పలు విత్తన, ఎరువుల విక్రయ షాపు ల్లో బృందం సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లో పత్తి, ఇత ర విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, షాపుల లైసెన్స్ గడువు తేదీలు, కంపెనీల ఇన్ వాయిస్ పత్రాలను పరిశీలించారు. అనంతరం టాస్క్ఫోర్స్ బృందం అధికారులు స్వప్న, ఉదయ్కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. హెచ్టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని , అలాంటి వాటిని రైతు లు కొనుగోలు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్, వ్యాపారులు పాల్గొన్నారు.
విత్తనాల షాపులో..
భువనగిరి అర్బన్, జూన్ 3 : భువనగిరి అడిషనల్ ఎస్పీ భుజంగరావుతోపాటు మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని పాత గంజ్ మార్కెట్లోని విత్తనాల విక్ర య షాపులో గురువారం తనిఖీ లు నిర్వహించారు. గంజ్ మార్కెట్లో రంగ కిష్టయ్య అనే వ్యాపా రి షాపు లైసెన్స్నం. ఎన్ఎల్జి/16/జేడీఏ/ఎస్డీ/ 2015/3984, షాపు నం.1-2-269లో విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసు లు జరిపిన తనిఖీలో గడువు ముగిసిన విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ తనిఖీలో1. ప్లాక్సీడ్ లాట్ నం.ఏఎస్ఎల్20-01-బీఐకే-6623 ప్యాకెట్స్-51 (ఒక్కటి 500 గ్రాములు) వీటికి సంబంధించిన గడువు 23.05.2021, 2. విత్తనాల ప్యాకెట్స్ 46కు సంబంధించిన తయారు తేదీ 30.05.2019 ఉండగా గడువు తేదీ 28. 05. 2021తో ముగిసిన మందులు, విత్తనాల మొత్తం విలువ రూ.18,140 ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని షాపు యజమాని రంగ కిష్టయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఆత్మకూరు(ఎం), జూన్ 3: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఉన్న ఎరువు ల దుకాణాలను ఎస్ఐ ఎండీ ఇద్రీస్ అలీ, ఏవో శ్రీనివాస్ గురువారం తనిఖీలు చేశారు. ఎరువులు, విత్తనాలను కొన్న ప్రతి ఒక్కరికీ షాపు నిర్వాహకులు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని వారు సూచించారు.