మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్లో రూ. 7.62 కోట్ల నిధులతో పట్టణ సుందరీకరణ పనులు
రోడ్డు సుందరీకరణ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన మంత్రి
నిర్మల్ అర్బన్, జూలై 6 : స్వరాష్ట్రంలోనే పట్టణాలకు మహర్దశ చేకూరిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని విశ్రాంతి భవ నం ఎదుట పూర్తయిన రోడ్డు సుందరీకరణ ప్రాజెక్టు పను లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవిం ద్కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి అభివృద్ధి పనులు పరిశీలించారు. అక్కడి నుంచి శ్యాంగఢ్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రూ.7.62 కోట్ల నిధులతో నిర్మల్లో శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపా యల నిధులతో పట్టణాలను అభివృద్ధి పరుస్తుందని, పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాలను అభివృద్ధి పర్చడ మే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. సుందరీక రణ పనులను వేగంగా పూర్తి చేసి మంత్రి కేటీఆర్తో ప్రారం భింపజేస్తామన్నారు. శ్యాంగఢ్ కోటను అభివృద్ధి పర్చామని, కంచెరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తా మని, కుంటాల, కడెం ప్రాజెక్టులు, కవ్వాల్ అభయా ర ణ్యం పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. కడ్తాల్ వద్ద హరిత హోటల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పలు మున్సిపాలిటీల పర్యటనలో భాగంగా మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నిర్మల్ పర్యట నకు వచ్చారని పేర్కొన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాద్యక్షులు పాకాల రాం చందర్, రాంకిషన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము కౌన్సిల ర్లు, నాయకులు పాల్గొన్నారు.
భైంసాలో మున్సిపల్ కార్యదర్శి సందర్శన
భైంసా, జూలై 6 : భైంసాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ సందర్శించారు. ముందుగా కాలినడకన మొక్కలు. వైకుంఠధామం, ఫౌంటెయిన్లు, వీధి దీపాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, కమిషనర్ అలీం, తహసీల్దార్ విశ్వంభర్, నాయకులు రాము, అసిఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఫారుఖ్, తదితరులు ఉన్నారు.