హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అజిత్ సింగ్ మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. నాటి రాష్ట్ర ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అజిత్ సింగ్ తన పార్టీ పక్షాన లేఖ ఇచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాంటి గొప్ప నేత ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ ఉద్యమ కారుడిగా దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం