నల్లగొండ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ర్టంలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
రైతులకు రైతు బీమా, రైతు బంధు, ప్రాజెక్ట్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎస్ఎల్ బీసీ కాలువ ద్వారా వచ్చిన నీటిని రైతులు పంటల సేధ్యానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలువ ద్వారా నకిరేకల్, కేతపల్లి మండలాల్లోని కుంటలు, చెరువులను నింపి రైతులను ఆదుకుంటామన్నారు.
కార్యక్రమంలో కట్టంగూర్ జెడ్పీటీసీ తలార బలరాం, నకిరేకల్ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమరాణి, మారం వెంకట్ రెడ్డి, మురారి శెట్టి కృష్ణ మూర్తి, నూక సైదులు, మంగినపల్లి రాజు, చౌగోనీ నాగరాజు, నర్సింగ్ రవి, సాయి తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి