రాజకీయ పార్టీలు, సంస్థలు, మేధావులను ఏకం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని స్మరించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు
సంగారెడ్డి జిల్లా బృందం: అమరుల త్యాగాల ఫలితే నేటి తెలంగాణ రాష్ట్రమని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమరుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించారు. ఆంధ్ర పాలకుల చెరనుంచి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధ్ది చేశారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కళలు కన్న బంగారు తెలంగాణ రూపొందుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ సాధన కోసం మిలిటెంట్ ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, ఉద్యోగ, విద్యార్థి, యువజన ఉద్యమాలను నేతలు చెప్పారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలను వివరించారు. పోరాటాలు, త్యాగాల బలిదానాలతో శాంతియుతంగా సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరిగాయన్నారు.