న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ మహానగరంలోని సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, మెట్రో రైల్ స్టేషన్లు, ప్రార్ధనా మందిరాలను సూపర్ స్ప్రెడర్ ఏరియాలుగా ప్రకటించింది. ఆయా సూపర్ స్ప్రెడర్ ఏరియాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని వివిధ జిల్లాల మజిస్ట్రేట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.