హైదరాబాద్ : కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజవైతే వారిని తక్షణమే ఉద్యోగంలోంచి తొలగించడమే కాకుండా 5 సంవత్సరాల జైలు శిక్ష పడేలా చూడాలన్నారు. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
వ్యవసాయశాఖ అధికారులు అలసత్వం వీడాలని సీఎం అన్నారు. ప్రేక్షక పాత్ర వహించకుండా కల్తీలను పసిగట్టి నియంత్రించాలన్నారు. దీనికి జిల్లా వ్యవసాయధికారి అసిస్టెంట్ డైరక్టర్లు బాధ్యత వహించాలన్నారు. వారి వారి జిల్లాల్లో పర్యటించి కల్తీకి అలువాటు పడిన ముఠాలను గుర్తించి పీడీ యాక్టు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్సీలు, కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు.