జమ్మికుంట: దళితులను ఆగం చేసేందుకే ప్రతిపక్ష పార్టీలు గడబిడ చేస్తున్నాయని జమ్మికుంట టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 11,12, 15వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించి, రాజకీయ
లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. కుట్రలు చేస్తున్న బీజేపీని నమ్మవద్దని సూచించారు. ప్రతి దళి త బిడ్డ ఇంటికీ దళితబంధు చేరుకుంటుందని స్పష్టం చేశారు. దళిత బంధుతో ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కౌన్సిలర్ పాతకాల రమేశ్, సుగుణ, బిట్ల కళావతి, వార్డు ఇన్చార్జి సయ్యద్ మసూద్ ఉన్నారు.