లండన్, మే 25: ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్పియర్ (81) మంగళవారం కన్నుమూశారు. వ్యాక్సిన్తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 8న ఆయన ఫైజర్ టీకా తీసుకున్నారు. ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కరోనా టీకా తీసుకుని రికార్డు సృష్టించారు.