వ్యవసాయ యూనివర్సిటీ, మే 27: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వ్యవసాయ, అగ్రి ఇంజినీరింగ్ ఆర్గానిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ ప్రవీణ్రావు తెలిపారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా 60 సీట్లు గ్రామీణ విద్యార్థులకు, 40 సీట్లు గ్రామీణ, అర్బన్ విద్యార్థులకు కేటాయించాలని ఇటీవల అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించామన్నారు. గతంలో పదో తరగతి పాస్ అయినవారు మాత్రమే ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు కాగా.. ఇక మీదట ఇంటర్ చదివిన విద్యార్థులు, పాలిసెట్లో ర్యాంకు పొంది మెరిట్ సాధిస్తే డిప్లొమాలో ప్రవేశాలకు అర్హులుగా నిర్ణయిస్తారు.