తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి కోసం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కావాల్సిన మెడిసిన్, సౌకర్యాల గురించి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మే1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వ కళాశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ కరోనా టీకాపై ప్రజలుఅపోహలు పెట్టుకోరాదని సూచించా రు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకాను విధిగా తీ సుకోవాలని సూచించారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కరోనా నిబంధన లు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.