ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 3: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో కొలువైన మహా పోచమ్మ దేవస్థానం అమ్మవారి గంగనీళ్ల జాతర ఈనెల 10న జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం నిర్మల్లో జాతర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లను అడెల్లి ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అంతకుముందు నిర్మల్ పట్టణంలో ఇంటింటా చెత్త సేకరిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది దేవి అడెల్ల, తెడ్డు లక్ష్మి, నిగులపు రాజేశ్వర్, చాకలి సతీశ్ను మంత్రి సన్మానించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.