కట్టంగూర్(నకిరేకల్), మే 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50మంది ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అలాగే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.