మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నసాగర్లో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొలు గ్రామానికి చెందిన ఇద్దరు వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నేత కుర్వ చంద్రమ్మ, టీడీపీ నాయకులు తోకల రవితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి..
తేనెటీగల దాడిలో గీత కార్మికుడి మృతి
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు