వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జమ్మికుంట పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోగం సుగుణ, నాయకుడు వెంకటేష్ సోమవారం హన్మకొండలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి వినోద్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని కౌన్సిలర్ సుగుణ తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, జమ్మికుంట జెట్పీటీసీ శ్యాం, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు