రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రంజాన్ పవిత్రమాసంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు అందజేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లౌకికత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లింలకు ఏటా దుస్తులు, ఇతర వస్తువులతో కూడిన రంజాన్ తోఫా (గిఫ్ట్ప్యాక్) అందజేసినట్టే ఈ ఏడాది కూడా ఇస్తారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ వక్ఫ్బోర్డు హజ్హౌజ్ నుంచి రాష్ట్రంలోని అన్ని మసీదులకు చేరవేసే బహుమానాల వాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు కమిటీలకు ఒక్కో కమిటీకి 500 చొప్పున 4.5 లక్షల రంజాన్ తోఫాలను అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వక్ఫ్బోర్డు సభ్యులు వహీద్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.