తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ కిస్టోన్ ఇన్ఫ్రాతోపాటు మరికొన్ని కంపెనీలను నిర్వహిస్తున్నాడని, గతంలో తమ బిల్డర్ ఫీనిక్స్ సంస్థతో కలిసి పనిచేశారని తెలిపారు. తమ కుటుంబం వద్ద రూ.కోట్లలో రుణం తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. మొత్తం రూ.10 కోట్ల వరకు తమకు ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. దీనిపై శనివారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని చెప్పారు. తమ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించిన తెలంగాణ పోలీసులకు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ఓ వీడియో విడుదలచేశారు.