పనాజీ : గోవాలో ప్రతి ఒక్కరికి డబుల్ వ్యాక్సిన్ డోసులు లభించిన తర్వాతనే స్థానిక పర్యాటక రంగాన్ని ప్రారంభించాలని అదేవిధంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే గోవాలోకి అనుమతించాలని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అన్నారు.
గురువారం ఆయన స్పందిస్తూ.. టీకా డబుల్ డోస్ పూర్తయిన పర్యాటకులను మాత్రమే గోవాలోకి ఆహ్వానించడం ప్రారంభించాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. గోవాతో పాటు పర్యాటకులను సురక్షితంగా ఉంచాలని తాము భావిస్తున్నట్లు మనోహర్ అన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో పర్యాటక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా తమ మంత్రిత్వశాఖ పాటిస్తుందని చెప్పారు.