నల్లగొండ : ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన క్రమంలో జిల్లాలో చాలా మంది మాస్కులు దరించడం లేదని, మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని డీఐజీ ఏవీ రంగనాధ్ హెచ్చరించారు. ప్రభుత్వం లాక్ సడలించిన తర్వాత చాలా మంది మాస్కులు ధరించకుండానే బయటికి వస్తున్నారు. దీని కారణంగా కరోనా వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి సహకరించాలని లేకపోతే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులుంటాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా జిల్లా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు.
శుభకార్యాలు, మరణాలు లాంటి వాటికి పరిమిత సంఖ్యలో, కుటుంబ సభ్యులతో మాత్రమే నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికి అనేక ప్రాంతాలలో పాజిటివ్ కేసులు ఉన్నాయని, మరోపక్క థర్డ్ వేవ్ ప్రమాదం సైతం పొంచి ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కేసులు నమోదు చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తమ అభిమతం కాదన్నారు. కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా కట్టడి చేయడం లక్ష్యంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ప్రజలు పోలీసులతో సహకరిస్తూ విధిగా మాస్కులు ధరించడం ద్వారా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం