జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన క్రమంలో జిల్లాలో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రభుత్వం లాక్ సడలించిన తర్వాత చాలా మంది మాస్కులు ధరించకుండానే బయటికి వస్తున్నారని, దీని కారణంగా కరోనా వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విధిగా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ