రూ.కోటి మంజూరు పత్రం అందజేత
హుజూరాబాద్లో మంత్రి గంగుల
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేత కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పద్మశాలి భవన నిర్మాణానికి ఎకరం స్థలంతోపాటు రూ.కోటి మంజూరు పత్రాలను మాజీ మంత్రి ఎల్ రమణతో కలిసి పద్మశాలి నాయకులకు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పద్మశాలీలు తమ ఆత్మగౌరవ భవనం కోసం ఈటల రాజేందర్కు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. స్థలం, నిధులు కేటాయించకపోగా ‘మీకెందుకు భవనం’ అని అవహేళన చేసి మాట్లాడారని పద్మశాలి సంఘం నాయకులు చెప్తే బాధ కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఎకరం స్థలం, కోటి రూపాయలు కేటాయించారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి తదితరులు పాల్గొన్నారు.