జనగామ : జిల్లాలోని దేవరుప్పుల- మన్పహాడ్- లక్ష్మక్కపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు స్థల సేకరణ వేగంగా చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం ఇప్పటికే 145 ఎకరాలు సేకరించి పరిశ్రమల శాఖకు అప్పగించామని, ఈ జోన్ ఐదారువందల ఎకరాల్లో ఉండాలని సీఎం ఆదేశించారని అన్నారు.
దేవరుప్పుల పరిసరాల్లో 570 ఎకరాలు అనువైన స్థల సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిలను మంత్రి ఆదేశించారు. పాలకుర్తి మండల కేంద్రంలో రెండెకరాల స్థలంలో పాల ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కాగా, పాల ఉత్పత్తుల సహకార సంస్ధ చైర్మన్, ఎండీతో ఫోన్లో మాట్లాడి పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. డబుల్బెడ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్కు మంత్రి సూచించారు.
నియోజక వర్గంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్లైన చెక్డ్యాంలు వేగంగా పూర్తి చేయాలని, ఈ విషయంలో సాగునీటి శాఖ అధికారులు తరచూ సమీక్షలు నిర్వహించి త్వరితగతిన సాగునీరు అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం