నాగర్కర్నూల్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి నేటి వరకు అన్ని గ్రామల పంచాయతీలు, మున్సిపాలిటీల వార్డుల వారీగా 1,99,732 కుటుంబాలకు చెందిన 7,99,732 మంది ప్రజలకు గురువారం నాటకి ఇంటింటి ఫీవర్ ఫీవర్ సర్వే నిర్వహించాం. అందులో 4,651 మందికి జ్వరం ఇతర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారందరికీ కరోనా మెడికల్ కిట్లను అందజేశాం. వారందరికీ హోమ్ ఐసొల్యూషన్ లో చికిత్సను అంజేస్తున్నామని జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు.
లక్షణాలు గుర్తించిన హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారికి ప్రతిరోజు మెడికల్ సిబ్బంది వారివారి ఇండ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యే వరకు పర్యవేక్షణ తప్పనిసరిగా కలెక్టర్ శర్మన్ తెలిపారు.
ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా కేంద్రంలోని కొవిడ్ కంట్రోల్ రూమ్ 08540 230201,230202,230203 నెంబర్లకు తక్షణమే ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే ను అధికారులు సమర్థవంతంగా నిర్వహించామన్నారు.
సర్వేకు సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 21, 658 మంది కరోనా రోగులు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. 7,200 మంది వివిధ దశల్లో కరోనా తో చికిత్స పొందుతున్నారని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం