ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారింది. గతేడాది సత్తాచాటిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఫామ్లేమితో ఇబ్బందిపడుతున్న గైక్వాడ్ ప్రదర్శనపై చెన్నై ఆందోళన చెందుతోంది. రెండు మ్యాచ్ల్లోనూ అతడు వరుసగా 5(8), 5(16) పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతని స్థానంలో ఐపీఎల్లో అనుభవజ్ఞుడైన ఆటగాడు రాబిన్ ఉతప్పను తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
మిడిలార్డర్లో సురేశ్ రైనా, అంబటి రాయుడుతో బలంగా ఉంది. ఫామ్లో ఉన్న ఉతప్ప బెంచ్కే పరిమితం కావడంతో సీజన్ ఆరంభంలోనే జట్టు కూర్పుపై అవగాహనకు రావాలని ధోనీసేన ఆశిస్తోంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు సిద్ధంగా ఉండాలని ఉతప్పకు మేనేజ్మెంట్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ అవకాశం వస్తే సీనియర్ బ్యాట్స్మన్ డుప్లెసిస్తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.