మహబూబ్నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూ సేకరణ చేసిన భూములలో మట్టి తీసేందుకు రైతులు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులపై సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగులో ఉన్న పనులను తక్షణం పూర్తి చేయాలని, రైల్వే ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయమై అవసరమున్న చోట రైతులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తాసిల్దార్లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరించాలన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్యామగడ్డ తండా, ఉదండాపూర్, వల్లూరు, తదితర గ్రామాలలో సేకరించిన భూమికి సంబంధించి మట్టిని తొలగించడంలో రైతులు ఇబ్బందులు కలుగజేస్తున్నారని ఇంజినీర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఇదివరకే సేకరించిన భూమిలో మట్టిని తీసేందుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రైతులకు నచ్చచెప్పి ఒప్పించాలని ఆర్డీవోను ఆదేశించారు.
పెగ్ మార్కింగ్, బిల్లుల చెల్లింపుపై సమీక్షించారు. డి.ఆర్.ఒ స్వర్ణలత, మహబూబ్ నగర్ ఆర్డీవో పద్మశ్రీ, రైల్వే, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రమేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి