కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. దీంతో హైదరాబాద్ మెట్రోరైలులో రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లను నడుపుతామని మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 6.30నుంచి రాత్రి 7.45గంటల వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ నెల 8వ తేదీవరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.