స్టేషన్ బెయిల్ కోసం రూ.30 వేలు లంచం
జగిత్యాల కలెక్టరేట్, జూన్ 17: స్టేష న్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ జగిత్యాల టౌన్ ఎస్సై శివకృష్ణ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకా రం.. జగిత్యాలకు చెందిన అఖిలను మెట్పల్లికి చెందిన బెజ్జారపు శివప్రసాద్తో వివాహం జరగ్గా, అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని ఆమె సోదరి మౌనిక మార్చి 30న జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై శంకర్నాయక్ ఐదుగురిపై కేసు నమో దు చేశారు. అనంతరం వారికి స్టేషన్ బెయి ల్ జారీ చేశారు. శంకర్నాయక్ ఇటీవలే బదిలీ కాగా, ఆయన స్థానంలో ఎస్సైగా శివకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈయన తర చూ శివప్రసాద్, రాజేశ్కు ఫోన్చేసి కేసు పెండింగ్లో ఉన్నదని, స్టేషన్ బెయిల్ పొం దాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వారు ఎస్సైకి రూ.30 వేలు ఇస్తుండగా బయట డ్రైవర్ రవికి అందజేయాలని సూచించాడు. డ్రైవర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డ్రైవర్ రవి, ఎస్సై శివప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.