తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకొని.. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కొచ్చి అభ్యర్థి, మాజీ మేయర్ టోనీ చమ్మనీ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను వైరస్కు బారినపడ్డానని.. తన తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తాను లేకున్నా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని కోరారు.
త్వరగానే ఈ దశను అధిగమిస్తానని.. దేవుడు మనకు హకారం అందిస్తాడని పేర్కొన్నారు. 140 నియోజకవర్గాలున్న కేరళ అసెంబ్లీకి ఈ నెల 6న పోలింగ్ జరుగనుండగా.. మే 2న కౌంటింగ్ చేపట్టానున్నారు. ఇదిలా ఉండగా.. కేరళలో బుధవారం 2,653 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ఇప్పటి వరకు 10,94,404 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 25,249 యాక్టివ్ కేసులున్నాయి.