వేములపల్లి: పల్లె ప్రకృతి పనుల్లో భాగంగా వేములపల్లి మండల పరిధి రావులపెంట గ్రామానికి అన్ని మౌలిక వసతులు ఒక్కొక్కటిగా పూర్తయ్యాయి. గ్రామ సభలు నిర్వహించి ప్రణాళిక ప్రకారంగా రూపొందించుకొని అమలు చేయడంతో ఫలి తం నేడు ప్రతిబింబి స్తుంది. ఏడాదిన్నరలో అన్ని హంగులతో ముస్తాభై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపిగ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలో 12 వార్డులు ఉండగా జనాభా 4330 మంది ఉన్నారు. గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని వీధుల్లో దాదాపు రూ.30వేలతో 72 చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో 438 కరెంట్ పోల్స్ ఉండగా నాలుగు వందల పోల్స్కి ఎల్ఈడీ లైట్లను అమర్చారు. అదేవిధంగా గ్రామంలోని వీధుల వెంట, గ్రామ పరిధిలోని నార్కట్పల్లి-అద్దంకి రహదారి వెంట 3వేల మొక్క లు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
గ్రామంలోని పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తలను వేరు చేస్తూ సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ శివారులో నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో పండ్లు, పూల మొక్కలతో పాటు 15 రకాల 4వేల మొక్కలు నాటి సందర వనంగా తీర్చి దిద్దుతున్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా వైకుఠధామం, రైతు వేదిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వ సహకారంతో నిర్మిం చారు. గ్రామంలో ప్రకృతివనం, రైతు వేదిక, ఊర చెరువులు ఓకే దగ్గర ఉండడంతో ఊరికి సరికొత్త అందాన్ని ఇచ్చింది.
ప్రగతి రథం
నాడు గ్రామంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండేది. ఆ చెత్తను గ్రామ సిబ్బంది ఎత్తినా ఎలా తరలించాలో, ఎక్కడికి తర లించాలో తెలిసేది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ఈ సమస్యకు చెక్ పెట్టింది. డంపింగ్ యార్డు నిర్మాణంతో పాటు చెత్త తరలింపునకు ట్రాక్టర్ అందించింది. ఓ వైపు పారిశుధ్యంతో పాటు వ్యర్ధాల నుంచి ఎరువు లు తయారీ చేసి ఆదాయం పొందేలా ఆర్ధిక పరిపుష్ఠికి అవకాశాలు కల్పించింది.
ప్రకృతి వనం
పట్టణాల తరహలో ప్రకృతి వనం ఏర్పాటు చేయడం గ్రామానికి సరికొత్త అందాలు తెస్తున్నది. పలు రకాల పూల మొక్క లు, పండ్ల మొక్కలు నాటడంతో పాటు వాకింగ్ ట్రాకింగ్లను ఏర్పాటు చేశారు. దీంతో అహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేయబోతున్నామని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వీధి సీసీ మయం
గ్రామంలో గతంలో ప్రతి వీధి మట్టి రోడ్లతో దర్శనిమిచ్చేవి. దీంతో వానొస్తే నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే వారు గ్రామస్థులు. కానీ ఇప్పుడు గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేయడంతో ఈ సమస్య తీరిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు సమస్యల పరిష్కారానికై రైతు వేదిక
రైతులను ఎప్పటికప్పడు సంఘటితం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. దీనిలో భాగంగానే మండలంలో వేములపల్లి, రావులపెంట, శెట్టిపాలెం గ్రామాల్లో మూడు క్లస్టర్లుగా విభజించి రైతు వేదిక లను నిర్మించారు. దీంతో రైతులకు విజ్ఝాన కేంద్రాలుగా మారుతున్నాయి.
ప్రభుత్వ సహకారంతోనే గ్రామంలోని సమస్యలకు చెక్ పెట్టాం.. సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్రెడ్డి
ఏండ్ల తరబడి తీష్ఠ వేసిన సమస్యలను ప్రభుత్వ సహకారంతో తక్కువ సమయంలో పల్లె ప్రగతి పనులతో పరిష్కారానికి పునాది పడింది. దీంతో సంవత్సరంన్నర కాలంలోనే పనులు పూర్తి చేసి సమస్యలకు చెక్ పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం సహకా రంతో ఇంకా మరిన్ని అబివృద్ధి పనులు చేస్తాం.
గ్రామంలో ఇంత మార్పును ఎన్నడు చూడలే.. పిండి సతీశ్ రెడ్డి, గ్రామస్థుడు
గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఇప్పుడు చూస్తున్నాం. గ్రామంలోని వీధులు మొత్తం సీసీ రోడ్లుగా మారాయి. దీంతో గ్రామ వీధులు సుందరంగా తయారయ్యాయి. పట్టణాలకే పరిమితం అనుకున్న పార్కులు ఇప్పుడు గ్రామాల్లో అత్యంత సుదరంగా తీర్చిదిద్దారు. ప్రకృతి వనంలో వాటర్ పౌంటెన్ ఏర్పాటు చేయడం పట్టణ సంస్కృతిని తలపిస్తుంది. దీంతో గ్రామ ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం అందుతుంది.