తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సీఎస్ఐ ఆధ్వర్యంలో వార్షిక తిరోగమన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే ఇందులో పాల్గొన్న పలువురు కరోనా బారినపడ్డారు. కరాకోణంలోని సిఎస్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫాదర్ సి బినోకుమార్ (39), ఫాదర్ వై దేవప్రసాద్ (59) బుధవారం మరణించారు. వారి సహచరులు ఐదుగురు ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చర్చి వర్గాలు వెల్లడించాయి. మే తొలి వారంలో ఇద్దరు చర్చి ఫాదర్లు చనిపోగా, చాలా మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మరింత మందికి కరోనా సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.