ములుగు : జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపూర్ ములుగు మండలాల్లో ఐఏఎస్ అధికారుల బృందం స్మితా సబర్వాల్, క్రిస్టినా చోంగ్థు, వాకాటి కరుణ, దివ్య, ప్రియాంక వర్గీస్ పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు.
అలాగే గర్భిణులు రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని, పౌష్టికాహారం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో అంగన్వాడీ సేవలను ములుగు కలెక్టర్ కృష్ణా ఆదిత్య వివరించారు.
సొంత అంగన్వాడీ భవనాలు లేక ఇబ్బందులు కలుగుతున్నాయని సొంత భవనాలు నిర్మించాలని నివేదిక అందజేశారు. కాగా, మధ్యాహ్నం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఐఏఎస్ అధికారుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak పాటపై పోలీసులు అభ్యంతరం
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు