కుత్బుల్లాపూర్ : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చింతల్లో కేఎంజీ గార్డెన్లో 236 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.2 కోట్ల 36 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. అర్హులందరికీ సకాలంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు కొలు కుల జగన్, మంత్రి సత్యనారాయణ, నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ ఆగం పాండు, పార్టీ శ్రేణులు సురేశ్రెడ్డి, సత్తిరెడ్డి, సిద్ధిక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.