Telangana
- Jan 17, 2021 , 01:47:11
VIDEOS
అడాల్పూర్ అడవిలో బుల్లెట్ కలకలం

తాండూరు, జనవరి 16: వికారాబాద్ జిల్లా యాలాల మండలం అడాల్పూర్ అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరికి తుపాకీ బుల్లెట్తోపాటు మ్యాగ్జిన్ లభించడం కలకలం రేపుతున్నది. ఆ కాపరి వాటిని సర్పంచ్కు అప్పగించడంతో ఆయన అటవీ అధికారులకు చూపించి పోలీసులకు అందజేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ శనివారం విషయం బయటకు పొక్కింది. ఎవరైనా అడవిలో వేటకు వస్తే అక్కడ పడిపోయాయా..? లేదా ఇతర కారణం ఏమైనా ఉందా? అనే తెలియాల్సి ఉన్నది. తాండూరుకు చెందిన కొందరు వ్యక్తులు తరచూ వేట కోసం అటవీ ప్రాంతానికి వస్తుంటారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై రూరల్ సీఐ జలంధర్రెడ్డిని ప్రశ్నిస్తే.. బుల్లెట్, మ్యాగ్జిన్ దొరికిన విషయం వాస్తవమేనన్నారు. ఇది ఎవరిది?, ఎందుకు అక్కడ పడింది అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
MOST READ
TRENDING