హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంజన్ మెహతాకు అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్ఠాత్మక కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం అందించే ప్రఖ్యాత రామలింగస్వామి ఫెలోషిప్నకు ఎంపికయ్యారు. క్రోమోజోమ్ బయాలజీ రంగంలో విస్తృత పరిశోధనలకు కావాల్సిన నిధులను ఈ ఫెలోషిప్ కింద ఐదేండ్ల వరకు కేంద్రం అందించనున్నది. కాగా సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మం త్రిత్వశాఖ ఏటా అందించే డాక్టర్ హరగోవింద్ ఖురానా ఇన్నోవేషన్ బయోటెక్నాలజిస్ట్ – 2020 పురస్కారాన్ని ఇటీవలే ఆయన అందుకొన్నారు.