హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): పెద్ద పిల్లల్లో కరోనా వచ్చిన రెండు నుంచి ఆరు వారాల తర్వాత అరుదుగా కనిపించే మల్టీ సిస్టమ్ ఇన్లమేటివ్ సిండ్రోమ్ లక్షణాలు ఏడు రోజుల నవజాత శిశువులో ఉన్నాయని, నిలొఫర్ దవాఖాన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత తెలిపారు ఏపీలోని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారని, గతవారం చర్మంపై రకరకాల మచ్చలు, ఆయా సం, జ్వరంతో ఉన్న పసికందును ఆ దవాఖానలో చేర్చారని తెలిపారు. బిడ్డతోపాటు తల్లికి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చిందని, కొవిడ్ ఐజీజీఈ యాంటీబాడీస్ పాజిటివ్గా వచ్చాయని వివరించారు. తల్లి నుంచి శిశువు శరీరంలోకి ప్రతిరక్షకాలు చేరాయని, పసికందు చర్మంపై రంగుల మచ్చలు ఉండటాన్ని అరుదైన వ్యాధి లక్షణంగా పరిగణించాలని అన్నారు. చికిత్స పొందుతున్న శిశువులో అధిక జ్వరం, ఆయాసం, నడుము, పిరుదులు, కా ళ్లు, పాదాలవద్ద నీలం, ఎరుపు రంగుల్లో మచ్చలు చాలా పెద్దవిగా ఉన్నాయని, దీనిని పర్పూర పుల్మినెన్స్గా గుర్తించారని, శిశువుల్లో ఇలాంటి పరిస్థితి రావడం చాలా అరుదని పేర్కొన్నారు. యాంటీబాడీస్ తల్లి దగ్గర నుంచి శిశువుకు రావడం అరుదైన విషయమని, ప్రపంచం లో మూడు కేసుల్లోనే నవజాత శిశువులు ఇలా మల్టీసిస్టమ్ ఇన్లమేటరీ సిం డ్రోమ్ లక్షణాలతో జన్మించారని డాక్టర్ శ్రీలత చె ప్పారు. శిశువుకు ఇన్ఫెక్షన్లకు సంబంధించి పరీక్షలు చేశారని, రక్త పరీక్షలో తెల్లరక్తకణాలు పెరగడం, సీఆర్పీ, ఐఎల్6 చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో ఎటువంటి అనారో గ్య సమస్యలు లేవని, జ్వరం కూడా రాలేదని, ఆ చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్టు అక్క డి వైద్యుల ద్వారా తెలిసిందని వివరించారు. ఈ అరుదైన వ్యాధి లక్షణాలు రావడానికి కారణం, ఇతర అంశాలపై అధ్యయనాలు జరగాల్సి ఉన్నదని వెల్లడించారు.