టాలీవుడ్ కుర్రహీరో రామ్ పోతినేని రెడ్ మూవీ తర్వాత తమిళ దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు. లింగుస్వామి డైరక్షన్ లో తెరకెక్కే ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.
ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్ గానటిస్తోంది. రామ్ -లింగుస్వామిల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకి ఉస్తాద్ టైటిల్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసినిమాకి సంబంధించి ఏ అధికారిక ప్రకటన వచ్చినా ఉస్తాద్ అనే పేరుని పెట్టడంతో టైటిల్ అదేనంటున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈసినిమాని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని సినీ కెరీర్ లో ఈ సినిమా 19వది కావడం విశేషం.