మిస్సింగ్ కేసులను చేధించడమే లక్ష్యం : ఎస్పీ రంగనాథ్

నల్లగొండ : జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులను చేధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ బృందాన్ని ఏర్పాటు చేశామని, ఆ బృందం సమర్థవంతంగా పని చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఐదు మిస్సింగ్ కేసులను చేధించినట్లు పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బాపూజీనగర్కు చెందిన వడ్లపల్లి నాగభారతి అదృశ్యం కాగా, ఇటీవలే ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగభారతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా నగరంలోని జగద్గిరిగుట్టకు వెళ్లింది. అక్కడే ప్రయివేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆధునిక టెక్నాలజీతో ఆమె ఆచూకీని కనుగొని శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
మిస్సింగ్ కేసులను చేధించడంలో కీలకంగా పని చేస్తున్న సీఐ సత్యం, ఎస్ఐలు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్స్ నర్సింహా, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్లను ఎస్పీ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఉన్న అన్ని మిస్సింగ్ కేసులను వీలైనంత త్వరగా చేధిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్