ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వరకట్నం కోసం వేధించాడు.. కేసు పెట్టారని అత్త, భార్యపై పగ పెంచుకున్నాడు. కిరాయి రౌడీలతో కలిసి ఇద్దరినీ హత్య చేయించాడు. ఈ జంట హత్యల ఘటన ఈ నెల 18న కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావనం కాలనీకి చెందిన విజయలక్ష్మి, రవీనను హత్య చేసిన కేసులో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన కాలేరు అరుణ్కుమార్ 2019లో ఆన్లైన్లో పజ్జీ గేమ్ ఆడుతుండగా, మంచిర్యాలకు చెందిన పూదరి రవీనాతో పరిచయం ఏర్పడింది. అదీకాస్త ప్రేమగా మా రింది. ఇద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి 11/06/ 2020న మంచిర్యాల రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బోధన్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో రవీ నా గర్భం దాల్చింది. అప్పటి నుంచి అరుణ్కుమార్ తనకు కట్నం ఇవ్వాలని రవీనాను వేధించసాగాడు. దీంతో 20.12.2020న తన తల్లిగారింటికి వచ్చింది. అయినా నిత్యం ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఇక భరించలేని రవీనా మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అరుణ్కుమార్పై 498 (ఎ) కేసు నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న అరుణ్కుమార్ అత్త విజయలక్ష్మి, భార్య వాళ్ల బంధువులకు వారి గురించి అసభ్యంగా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టేవాడు. దీంతో అత్త విజయలక్ష్మి కూ డా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అరుణ్కుమార్ యూట్యూబ్ చూస్తున్న క్రమంలో ఓ న్యూస్ చానల్లో గన్ కల్చర్ ప్రోగ్రాం వస్తుండగా కామెంట్ బాక్స్లో విజయవాడకు చెందిన జుజ్జవరపు రోషయ్య అలియాస్ బిట్టు కిడ్నాపులు, హత్యలు చేస్తానని, అవసరమున్న వారు తనను సంప్రదించాలని నంబర్ పోస్టు చేశాడు. దీంతో అరుణ్కుమార్ అతడిని సంప్రదించాడు. తన భార్యను, అత్తను చంపాలని కోరాడు. దీంతో అతడు రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే తన వెంట తెనాలికి చెందిన దండం వెంకట సుబ్బారావు అలియాస్ సుబ్బును కూడా తీసుకొస్తానని చెప్పాడు. అరుణ్కుమార్ చెప్పిన ప్రకారం సుబ్బు, బిట్టు ఇద్దరు విజయవాడ నుంచి ట్రైన్ ద్వారా 17/06/2021న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అరుణ్ వారిని పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. 17/06/2021న రాత్రి లాడ్జిలో పడుకున్నారు. 18/06/ 2021న తెల్లవారు జామున 3 గంటలకు అరుణ్కుమార్ తన బుల్లెట్పై వారిని వెంటబెట్టుకొని అత్తగారింటికి వ చ్చాడు. విజయలక్ష్మి బయటకు రాగానే ఒక్కసారిగా ముగ్గురు ఆమెపై దాడి చేశారు. విజయలక్ష్మిని చంపిన తర్వాత సుబ్బు, బిట్టు ఇద్దరు నేరుగా బెడ్రూంలోకి వచ్చి రవీనా మెడ చుట్టూ తాడు బిగించి హత్య చేశారు. అనంతరం విజయలక్ష్మి శవాన్ని బెడ్రూంలో పడేసి ఆమె మెడలో ఉన్న బంగారం చైన్, చెవి దుద్దులు తీసుకున్నారు.
అనంతరం అరుణ్కుమార్ హైదరాబాద్లోని తన బావ ఇంట్లో ఒక రోజు ఉండి, తర్వాత బోధన్కు వెళ్లాడు. కిరాయి రౌడీలకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం అరుణ్ ప్రయత్నిస్తుండగా, నిజామాబాద్ బస్టాండ్ దగ్గర పోలీసులు వారిని పట్టుకుని మంచిర్యాలకు తీసుకువచ్చారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్, ఓఎస్డీ శరత్ చం ద్రపవార్, ఏసీపీ అఖిల్ మహాజన్, పట్టణ సీఐలు ముత్తి లింగయ్య, శ్రీనివాస్, ఎస్సైలు ప్రవీణ్కుమార్, దేవయ్య, కిరణ్కుమార్లను సీపీ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాదాపూర్లో 15 ఏండ్ల బాలిక అదృశ్యం..
విషాదం: నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
నన్ను దెయ్యాలు వేధిస్తున్నాయి.. పోలీసులకు ఫిర్యాదు
మద్యం మత్తులో యువకుల వీరంగం