హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేరియంట్లు మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలోనూ కరోనా వేరియంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్లో కొత్త కరోనా వేరియంట్ కూడా ఉన్నట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్(SARS-CoV-2) జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. జీనోమ్ సీక్వెన్స్లో సరికొత్త వేరియంట్ భారత్లో ఉన్నట్లు గుర్తించామని కన్సోర్టియమ్ ఆఫ్ జీనోమిక్స్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తెలిపింది. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్యశాఖశ ఏర్పాటు చేసిన జీనోమిక్స్ కన్సోర్టియంలో మొత్తం జాతీయ పరిశోధనశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వ్యాప్తి జరుగుతున్న కోవిడ్ 19 వైరస్ కేసులకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ను ఐఎన్ఎస్ఏసీఓజీ స్టడీ చేస్తున్నది. భారత్లో జరుగుతున్న పరిణామాలను.. ప్రపంచ దేశాలతో ఆ గ్రూపు పోలుస్తున్నది. వైరస్కు చెందిన జీనోమ్ వైరియంట్లు సహజమని, దాదాపు అవి అన్ని దేశాల్లో ఉన్నట్లు జీనోమిక్స్ పేర్కొన్నది. వేర్వేరు దేశాలకు చెందిన స్ట్రెయిన్లతో పాటు భారత్కు చెందిన ప్రత్యేకమైన వేరియంట్ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. డబుల్ మ్యూటెంట్ వేరియంట్ను దేశంలోని 18 రాష్ట్రాల్లో గుర్తించినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.
జీనోమిక్స్ ల్యాబ్లు ఇప్పటి వరకు 771 వేరియంట్లను గుర్తించాయి. 10787 పాజిటివ్ కేసులను పరిశీలించిన తర్వాత ఆ వేరియంట్లను పసికట్టారు. వీటిల్లో 736 శ్యాంపిళ్లలో యూకే వేరియంట్ వైరస్ ఉన్నట్లు తేల్చారు. 34 శ్యాంపిళ్లలో సౌత్ ఆఫ్రికా వేరియంట్ ఉన్నది. మొత్తం 18 రాష్ట్రాల్లో కరోనా వేరియంట్లను గుర్తించినట్లు జీనోమిక్స్ పేర్కొన్నది. అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన శ్యాంపిళ్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ జరిగినట్లు కేంద్రం పేర్కొన్నది. మహారాష్ట్ర నుంచి సేకరించిన శ్యాంపిళ్లలో వైరస్ ఎక్కువగా పరివర్తన చెందినట్లు గుర్తించారు. E484Q, L452R మ్యుటేషన్లతో.. ఇమ్యూనిటీ తగ్గుతుంది. 20 శాతం వరకు శ్యాంపిళ్లలో ఇలాంటి మ్యుటేషన్ వైరస్లను కనుగొన్నారు.