వనపర్తి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రైతులకు సేవలందిస్తున్న పెద్దజీతగాడినని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో 20 మందికి డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలుపాలనే ముఖ్యమంత్రి లక్ష్యంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉన్నదని తెలిపారు.