హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎడ్సెట్లో 98.53 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎడ్సెట్లో ఇంతమంది క్వాలిఫై కావడం సెట్ చరిత్రలో ఇదే తొలిసారి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్సెట్ నిర్వహించగా.. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. 33,683 (98.53%) విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 77 శాతమే ఉత్తీర్ణులయ్యారని, 98 శాతానికిపైగా పాస్ కావడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు వెల్లడించాయి. పురుషులు 99.52 శాతం, మహిళలు 98.24 శాతం మంది అర్హత సాధించారు.