హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఎక్కడ ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే మొదలుపెడుదాం’ ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. పాఠశాల విద్యాశాఖ అచ్చం దీన్నే ఫాలో అయింది. ఎక్కడయితే పిల్లల ప్రవేశాలు లేక పాఠశాలలు మూతపడ్డాయో.. మళ్లీ అక్కడే చిన్నారులు సర్కారు బడుల్లో చేరేలా ప్రోత్సహించింది. ఆ స్కూళ్లు తెరుచుకోవడంలో సక్సెస్ అయింది. అధికారులు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు వీలు కల్పించారు. స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తున్నది. జీరో అడ్మిషన్లతో మూతబడిన బడులు పిల్లల రాకతో మళ్లీ కళకళలాడుతున్నాయి. ఇలా రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరమే 94 స్కూళ్లు తెరుచుకున్నాయి. వీటిలో సెప్టెంబర్ మొదటివారం వరకు 1,478 మంది విద్యార్థులు చేరారు.
2020-21 యూ-డైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సున్నా అడ్మిషన్లు నమోదయిన పాఠశాలలు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1,179, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 11 చొప్పున ఉన్నాయి.
గతంలో మూతపడి ఈ విద్యాసంవత్సరం మళ్లీ తెరుచుకున్న బడులు. (దీంతో జీరో అడ్మిషన్లు నమోదయిన స్కూళ్ల సంఖ్య 1,107కు తగ్గింది)
పిల్లలు లేకపోవడంతో మా స్కూల్ను 2018-19లో మూసేశారు. ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకున్న తర్వాత ఎంఈవో, సర్పంచ్ల చొరవతో గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరాం. విశేష స్పందన వచ్చింది. గ్రామంలో 6-10 ఏండ్ల వయసు పిల్లలు 31 మంది, ప్రీ ప్రైమరీ పిల్లలు ఆరుగురు ఉండగా.. మొత్తం 37 మంది పిల్లలు ప్రభుత్వ బడిలోనే చేరారు.
కిశోర్, టీచర్, దస్తగిరిపల్లి
మా స్కూల్కు పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. కొత్త అడ్మిషన్లు పెరిగాయి. ఇప్పుడు 21 మంది విద్యార్థులయ్యారు. వారి పేర్లను సైతం యూడైస్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నాం.
బానోతు సుష్మా, టీచర్, హట్య తండా
పెద్దపల్లి జిల్లాకేంద్రానికి సమీపంలోని పెద్దబొంకూరు హామ్లెట్ గ్రామం దస్తగిరిపల్లి మండల ప్రాథమిక పాఠశాల 2018-19 విద్యాసంవత్సరంలో మూతబడింది. ఈ విద్యా సంవత్సరమే స్కూల్ను మళ్లీ తెరిచారు. ఒక్క చిన్న ప్రయత్నంతో ఒక్కరూ ప్రైవేటు బాటపట్టకుండా ఊరిలో 37 మంది పిల్లలుంటే వందశాతం ఇక్కడే ప్రవేశాలు పొందారు.