సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 6: రాష్ట్రంలోని వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ- 2021కు ఇప్పటివరకు 8 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 6 వేలు అమ్మాయిలవే ఉన్నాయని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి చెప్పారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని వివరించారు. ఆన్లైన్ పరీక్షలను సెప్టెంబర్ 8వ తేదీ నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు.