హైదరాబాద్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలను తెలంగాణ భవన్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్.. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
జగ్జీవన్ రామ్ స్ఫూర్తి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి