బొమ్మలరామారం, మే 4: తెలంగాణ ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే సంకల్పంతో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మండలంలోని యావపూర్తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతంలో బొమ్మలరామారం గ్రామ పంచాయతీలో రెండు వార్డులుగా ఉన్న ఖాజీపేట గ్రామం, జలాల్పూర్ గ్రామపంచాయతీలో రెండు వార్డులుగా ఉన్న యావపూర్తండాలను కలిపి 8 వార్డులతో యావపూర్తండా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు పల్లె ప్రగతిద్వారా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం అందించిన నిధులతో సర్పంచ్ ధీరావత్ అరుణ అధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు సమన్వయం తో పనిచేయడంతో గ్రామ రూపురేఖలు మారిపోయా యి. యావపూర్తండా పంచాయతీలో 779 మంది జనాభా ఉండగా, 540 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామస్తుల సహకారంతో వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, పల్లెప్రకృతివనం పనులు పూర్తియ్యాయి. గ్రామంలోని వీధులను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తున్నా రు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్య పరిష్కరించారు. 11 పాతఇండ్లు, 2 పాతబావులను పూడ్చివేశా రు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. సీసీరోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అండర్ గ్రౌండ్ డైనేజీ పనులు పూర్తికావచ్చాయి.
రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు
రెండు సంవత్సరాల్లో గ్రామపంచాయతీకి ప్రభుత్వం రూ.35లక్షలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.12లక్షల60వేలతో వైకుంఠధామం , రూ.2లక్షల 40వేలతో కంపోస్ట్షెడ్ నిర్మాణం, రూ. 5లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. రూ.40వేలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 2వేల మొక్కలను సంరక్షిస్తున్నారు. రూ.9లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. రూ.3లక్షల43 వేలతో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. రూ.12లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. తడి,పొడి చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలించి ఎరువుగా మార్చుతున్నారు. వీధుల్లో చెత్త వేయకుండా ఆంక్షలు విధించారు.