మియాపూర్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ గాంధీ నేతృత్వంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ చిత్రపటానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్యాదవ్, జగదీశ్వర్ గౌడ్లతో కలిసి విప్ అరెకపూడి గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ.. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. సార్ కలలు కన్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రతి ఒక్కరూ పునరంకితులు కావాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్రావు, వీరేశంగౌడ్, కొండా విజయ్కుమార్, ఎర్రగుడ్ల శ్రీనివాస్యాదవ్, పురుషోత్తం యాదవ్, యాదా గౌడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, మలిదశ ఉద్యమ ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతిని సోమవారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, దాసు, కొండల్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, జూన్ 21: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ ఖాజగూడలో టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.